వృద్ధ దంపతులకు సాయం: ఉత్తమ్కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ్ చేసిన ఒక ట్వీట్పై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఓ వృద్ద దంపతులకు వెంటనే సాయన్నందించేలా చేశారు.
కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని కర్జెల్లి ఎస్టీ కాలనీలో వృద్ధ దంపతులు నివాసముంటున్న గుడిసెకు స్థానిక అధికారులు రూ.500 ఇంటి పన్నును విధించారు. ఈ విషయాన్ని ఉత్తమ్ మంగళవారం సీఎంవో, మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు.
అధికారులు ఇచ్చిన రశీదు, వృద్ధులు గుడిసె ముందు ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. వృద్ధుల నుంచి వసూలు చేసిన పన్నును తిరిగి చెల్లించాలని, డబుల్బెడ్రూం ఇంటిని వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Thanks Uttam Kumar Reddy Garu for bringing it to my notice
— KTR (@KTRTRS) June 12, 2018
Request the @Collector_KB to direct local panchayat secretary to rectify this mistake@Collector_KB to also provide them with 2BHK and Aasara pension if they aren’t already revving it https://t.co/MstrswhWcD
కాగా, ఉత్తమ్ ట్వీట్పై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. స్థానిక పంచాయతీ కార్యదర్శి చేసిన పొరపాటును సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వృద్ధ దంపతులకు డబుల్ బెడ్రూం ఇల్లుతోపాటు ఆసరా పెన్షన్ వెంటనే మంజూరు చేయించాలని మంత్రి ఆదేశించారు.