రేవంత్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు వడ్డీతో సహా చెల్లిస్తాం: కేటీఆర్ ధ్వజం
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.
అది ఫేక్ అయితే చంచల్ గూడా జైలుకు వెళ్తా : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓయూ ఫేక్ సర్క్యులర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్టు పైన ఆయన స్పందించారు.క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సర్కులర్ ఫేక్ సర్క్యులర్ అయితే తాను చంచల్ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం
బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమీ కాదని ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, తాము కూడా తప్పకుండా బదులు చెప్పి తీరుతామని , వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పై ఓ పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందన్నారు.
దమ్ముంటే నువ్వు ఆ పని చెయ్ రేవంత్ రెడ్డి
అసలు తప్పు చేసిన రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి బయట తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ ను నిపుణుల ముందు పెడదామని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తేలుద్దామని ఆ తర్వాత ఎవరు చంచల్ కూడా జైల్లో ఉండాలో తేలిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా?
— BRS Party (@BRSparty) May 8, 2024
- రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx
రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకో
చెయ్యని తప్పుకు క్రిషాంక్ ను జైల్లో పెట్టారనీ, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలికారు. తెలంగాణ సర్కార్ చేసిన వెధవ పనికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయని క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications