దావోస్ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఎన్నారైల ఘన స్వాగతం
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. ఆయనకు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం జ్యూరిచ్ నగరంలో పలు సమావేశాలకు కేటీఆర్ హాజరు కానున్నారు.
ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతారు.
Minister @KTRTRS who is leading the state govt delegation to @WEF Davos, was accorded a warm welcome at Zurich airport by diaspora representatives. #TelanganaAtDavos #InvestTelangana pic.twitter.com/Sq4GHzpEaz
— Min IT, Telangana (@MinIT_Telangana) January 20, 2018
ఈ నెల 23 నుంచి 26 వరకు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోడీతో ప్రపంచంలోని వందకుపైగా దేశాల నుంచి అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు, నిర్వాహకులు, 2500 ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి మంత్రి కేటీఆర్ నాయకత్వం వహిస్తారు.