'అవమానపరుస్తూ సంబరాలా, కవిత కోసమే మహిళలకు మంత్రి పదవి ఇవ్వడం లేదు'
జనాభాలో సగ భాగం ఉన్న మహిళలను ముఖ్యమంత్రి కెసిఆర్ అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మేల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.
హైదరాబాద్:జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ముఖ్యమంత్రి కెసిఆర్ అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మేల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.మహిళకు మంత్రి పదవిని ఇస్తే కవితకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉన్నందున మహిళలను క్యాబినెట్ లో తీసుకోలేదన్నారాయన.
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన బుదవారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాలో సగ భాగం ఉన్న మహిళలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలో మహిళ అంటే మీ కూతురు కవిత ఒక్కరేనా అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు మంత్రి పదవులు ఇస్తే తన కూతురుకు ప్రాధాన్యత దక్కదనే కెసిఆర్ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఆడవాళ్ళకు ఒక్క పదవి ఇవ్వకుండా సంబరాలు జరుపుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కెసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఒక్క ఎమ్మేల్సీ పదవైనా మహిళకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలో తెలంగాణ మాత్రమే ఉందని షబ్బీర్ అలీ చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications