వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాలు ర్యాలీలు
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్ ప్రభావం తెలంగాణలో స్వల్పంగా జరిగింది. జిల్లాల్లో ఉదయం బస్ డిపోల వద్ద నేతలు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్లో భాగంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం నుంచి ఇందిరా పార్క వరకు లెఫ్ట్పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సిపిఎం నేత బీవీ రాఘవులు ముందుండి ఈ ర్యాలీని నడిపించారు. ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
English summary
Left parties protests against Big notes ban.
Story first published: Tuesday, November 29, 2016, 19:32 [IST]