ముందుంది మొసళ్ల పండుగ , వ్యతిరేకత వల్లే తక్కువ శాతం ఓటింగ్ : లక్ష్మణ్
తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతోనే తక్కువ శాతం ఓటింగ్ నమోదైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కాగా కల్వకుంట్ల కుటుంభానికి పార్లమెంట్ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చనున్నాయని అన్నారు. కాగా రెండు రాష్ట్రాల్లో ఉన్న చంద్రులకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పారు.
ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతవుతుందని చెప్పిన ఆయన ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ,తెరాస మాత్రమే మిగులుతాయని అన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారని అన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న వాటికంటే ఎక్కువ స్థానాలను గెలుస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. మే తర్వాత బీజేపీ మరోసారి అధికారంలోకి రానుందని చెప్పారు.













Click it and Unblock the Notifications