తెలంగాణలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు ఆరుగురు బలి !
తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుతో రెండు వేర్వేరు జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు విరుచుకుపడుతున్నాయి. బుధవారం జరిగిన రెండు ఘటనల్లో మొత్తం ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
నిర్మల్ జిల్లా ఘటన..
నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. కొద్దిసేపటికి మెరుపులు మెరుస్తూ గాలివాన మొదలైంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడి రైతు దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వలతో పాటు రైతు కూలీ వెంకటి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఘటన
ఇదే రోజు మరో ఘోర ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోనూ చోటుచేసుకుంది. ఐజ మండల కేంద్రంలో రైతులు వ్యవసాయ పనులు ముగించుకుని పొలాల్లో ఉండగా వర్షం ప్రారంభమైంది. ఆ సమయంలో పిడుగుపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఒక్కరోజులోనే రెండు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోవడం, నలుగురు తీవ్రంగా గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రైతులు కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి మౌనం విడిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ప్రభుత్వం తరఫున విపత్తు సహాయక నిధి (ఎక్స్ గ్రేషియా) కింద మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. పిడుగుపాట్ల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. వర్షం కురిసే సమయాల్లో చెట్ల కింద, పొలాల్లో ఎక్కువసేపు ఉండకూడదని హెచ్చరించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications