చేతులెత్తేసిన జేపీ: ఎన్నికల్లో పోటీ చేయం, ఎందుకు?
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేయదని జయప్రకాశ్ నారాయణ ప్రకటించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని, లోక్ సత్తాను రాజకీయ పార్టీగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు అధికారాలు, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం కోసం నిరంతరం పోరాటం సాగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, 2006లో లోక్సత్తా పార్టీని మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ స్థాపించారు.

ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభలో తనదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు.
అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్తంత దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఇకపై ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయదని ఆయన ప్రకటించారు. ప్రజలందరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం అందించాలనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications