నగ్న చిత్రాలు చూపించి బ్లాక్మెయిల్: ప్రేయసిపై ప్రియుడి రేప్
హైదరాబాద్: అసభ్యకరమైన చిత్రాలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ తన కామవాంఛ తీర్చకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరించి ప్రియుడు ప్రేయసిపై అత్యాచారం చేశాడు. హైదాబాదు సమీపంలోని కుత్బుల్లాపూర్ మండంల సూరారం కాలనీ పాండు బస్టీకి చెందిన నాగరాజు అలియాస్ దొమ్మరరాజు మూడేళ్లుగా యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.
అతడు కారు కొంటానంటే నిరుడు రూ. 50 వేలు ఇచ్చింది. కారు కొనకుండా అతను ఆమెను మోసం చేశాడు. ఇద్రి విషయం రాజు బంధువులకు తెలిసింది. దీంతో అతనికి దేహశుద్ధి చేశారు. గతన నెల 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ప్రేయసి ఇంటికి వెళ్లిన రాజు తన వెంట రావాలని ఆమెను కోరాడు.
ఆమె అందుకు నిరాకరించింది. అయితే బలవంతంగా ఆమెను స్నేహితుడి ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బయటకు రావాలని తిరిగి 30వ తేదీన బెదిరించాడు. ఆమె ఎదురు తిరగడంతో నగ్న చిత్రాలను బయటపెడుతానని బెదిరించాడు. బాధితురాలు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలావుంటే ,భార్యపై అనుమానంతో ఓ భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం కూకట్పల్లిలో గల ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో చోటుచేసుకుంది. భాస్కర్(35)-ఊర్మిళ దంపతులు. ఊర్మిళ పోలీసు హోంగార్డ్గా పనిచేస్తుంది.
విధుల నుంచి ఆలస్యంగా వచ్చిందన్న కారణంగా భాస్కర్ అనుమానంతో భార్యను విపరీతంగా కొట్టాడు. అనంతరం కోపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.