ప్రేమించారు పెళ్ళిచేసుకొన్నారు... మరునాడే ఆత్మహత్య చేసుకొన్నారు
ప్రేమించారు, పెళ్ళిచేసుకొన్నారు. ఏమైందో ఏమో కాని, పెళ్ళి చేసుకొన్న మరునాడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు ఆ నవదంపతులు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకొంది.
మెదక్ :ప్రేమించారు, పెళ్ళిచేసుకొన్నారు. ఏమైందో ఏమో కాని, పెళ్ళి చేసుకొన్న మరునాడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు ఆ నవదంపతులు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకొంది.
మెదక్ జిల్లా వెల్థుర్తి మండలంలోని నాగుల మిట్ట గ్రామంలో వివాహం చేసుకొన్న 24 గంటల్లోనే నవ దంపతులు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం కల్గించింది.
వెల్థుర్తి మండలం నాగులమిట్టకు చెందిన ప్రేమికులు శనివారం నాడు వివాహం చేసుకొన్నారు. కొంత కాలం నుండి వీరిద్దరూ ప్రేమంచుకొంటున్నారు.శనివారం నాడు వారు వివాహం చేసుకొన్నారు. వివాహం చేసుకొన్న మరునాడే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివాహం చేసుకొన్న మరునాడే ఆత్మహత్యకు పాల్పడడం వెనుక గల కారణాలు అంతుబట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసుుల కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావడం లేదు.ప్రేమికులే ఆత్మహత్య చేసుకొన్నారా,ఇంకా ఏమైనా సంఘటనలు చోటుచేసుకొన్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.