కూల్డ్రింక్లో మత్తు ఇచ్చి నాపై అఘాయిత్యం: జూ.ఆర్టిస్ట్పై మహిళా ఆర్టిస్ట్ చెప్పులతో దాడి
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఓ జూనియర్ ఆర్టిస్ట్పై మరో మహిళా జూనియర్ ఆర్టిస్ట్ సహా మరికొందరు మహిళలు దాడి చేశారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ సదరు మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆ ఆర్టిస్టు శ్రీశాంత్ రెడ్డిపై వారు చెప్పులతో కూడా దాడి చేశారు. మొదట తన వెంట పడ్డాడని, ప్రేమించాలని బలవంతం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, కానీ ఇప్పుడు మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు.

ఈ మేరకు ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని లొంగదీసుకున్నాడని చెప్పారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి, తనకు స్ప్రే కొట్టి తనపై అఘాయిత్యం చేశాడని వాపోయారు. ఇతని వల్ల నా తండ్రి చనిపోయాడన్నారు. గతంలో ఆత్మహత్యాయత్నం చేశానన్నారు.
బాధిత జూనియర్ ఆర్టిస్ట్ వెంట మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు, ఇతర మహిళలు వచ్చారు. వారు శ్రీశాంత్ రెడ్డిపై చెప్పులతో దాడి చేశారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. శ్రీశాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట జూనియర్ ఆర్టిస్టులు బైఠాయించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications