కేసీఆర్కు షాక్: మల్లన్న సాగర్ నిర్వాసితుడి ఆత్మహత్య (పిక్చర్స్)
మెదక్: మల్లన్న సాగర్లో ఊరు మునిగిపోతుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తొగుట మండలం పల్లెపహాడులో నర్సయ్య, బూదవ్వ దంపతులు. వీరికి పిల్లలు లేరు. ఓ అమ్మాయిని దత్తత తీసుకొని, కొన్నేళ్ల క్రితం పెళ్లి చేశారు.
ఊర్లో ఉన్న 20 గుంటల భూమి, ఇల్లు వీరికి ఆధారం. కులవృత్థి, పింఛన్ ద్వారా వచ్చే ఆదాయంతో వీళ్లు బతుకుతున్నారు. అయితే, మల్లన్న సాగర్కు భూమిని సేకరించేందుకు వారంలోపు పల్లెపహాడ్, వేములఘాట్లో ప్రకటిస్తామని స్థానిక తహసీల్దారు వెల్లడించారు.
దీంతో నర్సయ్య (75) కలవరానికి గురయ్యాడు. ఊరు మునిగిపోతే తాము ఏ ఊళ్లో ఉండాలి, ఎలా బతకాలి అనే ఆందోళనతో మృతి చెందారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మల్లన్న సాగర్
తన భర్త నర్సయ్య ఆత్మహత్య నేపథ్యంలో ఆయన భర్య బూదవ్వ తొగుట పేలీస్ స్టేషన్కు ఫిర్యాదు లేఖ కూడా రాశారు. తన భర్త మృతికి కారణమైన వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మల్లన్న సాగర్
మల్లన్న సాగర్లో ఊరు మునిగిపోతుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తొగుట మండలం పల్లెపహాడులో నర్సయ్య, బూదవ్వ దంపతులు. వీరికి పిల్లలు లేరు. ఓ అమ్మాయిని దత్తత తీసుకొని, కొన్నేళ్ల క్రితం పెళ్లి చేశారు.
మల్లన్న సాగర్
ఊర్లో ఉన్న 20 గుంటల భూమి, ఇల్లు వీరికి ఆధారం. కులవృత్థి, పింఛన్ ద్వారా వచ్చే ఆదాయంతో వీళ్లు బతుకుతున్నారు. అయితే, మల్లన్న సాగర్కు భూమిని సేకరించేందుకు వారంలోపు పల్లెపహాడ్, వేములఘాట్లో ప్రకటిస్తామని స్థానిక తహసీల్దారు వెల్లడించారు.
మల్లన్న సాగర్
దీంతో నర్సయ్య (75) కలవరానికి గురయ్యాడు. ఊరు మునిగిపోతే తాము ఏ ఊళ్లో ఉండాలి, ఎలా బతకాలి అనే ఆందోళనతో మృతి చెందారు.
మల్లన్న సాగర్
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన ఇరుగుపొరుగు అతనిని ఆసుపత్రికి తరలించారు.
మల్లన్న సాగర్
అతనిని గజ్వెల్, అక్కడి నుంచి సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను గురువారం కన్నుమూశాడు. ఇది సీఎం కేసీఆర్కు షాక్ అని చెప్పవచ్చు.
మల్లన్న సాగర్
మల్లన్న సాగర్ను ప్రతిపాదిత ప్రాంతంలో కట్టవలసిన అవసరం లేదని, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గురువారం డిమాండ్ చేశారు. ఆయన గాంధీ ఆసుపత్రిలో నర్సయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు.