కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన మల్లు భట్టి విక్రమార్క
వరంగల్: రైతుల రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఏకిపారేశారు. టీఆర్ఎస్ది అసమర్థ, అవినీతి, అవగాహన లేని ప్రభుత్వమని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం చేస్తున్న దశలవారీ రుణమాఫీ రైతుల్లో, బ్యాంకు అధికారుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని తప్పు పట్టారు. శుక్రవారం వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు రైతు భరోసా యాత్ర సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రసంగించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయమంటే అలవిగాని కోరికలంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రిని తరిమికొట్టాల్సిన రోజు వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల కోసమే రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని, ఈ బంద్కు ప్రజలు మద్దతివ్వాలని కోరారు.

బీహార్లో ఓటమి భయంతోనే బీజేపీ మతాలను తెరపైకి తెస్తోందని, రిజర్వేషన్లు లేకుండా చేయడమే ఆరెస్సెస్ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయకపోవడం వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు పూర్తిగా రుణమాఫీ చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రేపటి తెలంగాణ బంద్కు అందరూ సహకరించాలని కోరారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications