బయటకు వెళ్లి వచ్చేసరికి భార్యాపిల్లలు మాయం: ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో భార్య, ముగ్గురు పిల్లలు కనిపించడంలేదని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ విషయం తెలిపారు. పని నిమిత్తం తాను బయటకు వెళ్లి వచ్చే లోపు తన కుంటుంబం మొత్తం కనిపించకుండా పోయారని ఆ వ్యక్తి పోలీసులకు వివరించాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
భార్యను చంపిన భర్త
నిజామాబాద్ జిల్లాలోని యాదగిరిబాగ్లో దారుణం జరిగింది. ఓ భర్త కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణంగా బంధువులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
హైదరాబాద్ నగరంలోని హయత్నగర్లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కారు-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లర్ల ముఠా పట్టివేత
ఆదిలాబాద్ జిల్లాలోని పులులను వేటాడుతున్న స్మగ్లర్ల ముఠాను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే పెద్ద పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.