హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోదుస్తుల్లో 2 కిలోల బంగారం, ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శుక్రవారం నాడు బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఆయూబ్ అనే ప్రయాణీకుడు లోదుస్తుల్లో బంగారం బిస్కెట్లు తీసుకు వస్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడ్డాడు.

అతని వద్ద నుండి సుమారు రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని పైన కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతను తన లోదుస్తుల్లో దాచి తీసుకు వచ్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

బావిలోపడి బాలురు మృతి

Man conceals 2kg gold in garments, gets arrested

ఆదిలాబాద్‌ జిల్లా కాశిపేట మండలం ధర్మారావుపేటలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు బాలురు శుక్రవారం ఓ బావిలో విగతజీవులుగా కనిపించారు. చిన్నారులు అజయ్‌, సంతోష్ రెండురోజుల నుంచి కనిపించడం లేదు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో బాలురు బావిలో శవాలుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ వివాక వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన పిల్లలు అదృశ్యమయై.. ఈరోజు విగతజీవులుగా కనిపించారు.

కానిస్టేబుల్ అరెస్ట్

సీసీఎస్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఎస్సై పోస్టులు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు గుంజిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

English summary
Man conceals 2kg gold in garments, gets arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X