ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడిన 15 ఏళ్ల కిందటి హత్య మిస్టరీ: బావే చంపి పూడ్చేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. బావమరిదిని స్వంత బావ హత్య చేసి పూడ్చి పెట్టాడు. 15 నెలల కిందట జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసిన పంచనామా నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

దొంగల ముఠా అరెస్టు

మెదక్ గజ్వేల్‌లో ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు 19 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.

Man kills brother-in-law in Ranga reddy district

విద్యుత్తు షాక్‌తో రైతు మృతి

నల్గొండ జిల్లా వలిగొండ మండలం ప్రొద్దుటూరులో విద్యుత్‌షాక్‌తో రైతు గజ్జి లింగస్వామి మృతి చెందారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతదేహం తీసుకుని వలిగొండ సబ్‌స్టేషన్‌ ఎదుట గ్రామస్తుల ధర్నా చేశారు. దీంతో భువనగిరి-వలిగొండ మధ్య ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్లలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

English summary
Police have busted 15 years back murder case of Rangareddy district of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X