కృష్ణుడికి లేని వివక్ష మీకెందుకు? మందకృష్ణ సూటి ప్రశ్న..!
శ్రీకృష్ణుడికి లేని కుల వివక్ష మీకెందుకని హిందూ ధర్మ పరిరక్షకుల్ని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ ఇవాళ ప్రశ్నించారు.
తమ మాదిగ జాతికి చెందిన జాంబవంతుడి కూతురును శ్రీకృష్ణుడు వివాహమాడలేదా అని అడిగారు. తెలంగాణలోని ఎల్లంపల్లిలో మాదిగ బిడ్డను హత్య చేసింది యాదవుడే కదా అన్నారు. లోకంలో ఇదేం ధర్మమని ఆయన ప్రశ్నించారు. అందరూ సమానమేనని హిందూ ధర్మ రక్షకులు ముందుకు రావాలన్నారు. కుల మత వివక్షలేని రాజ్యాన్ని స్థాపిద్దామన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఇటీవల దళితుడు ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు గురైన సందర్భంగా ఆయన దశదినకర్మ కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొన్నారు. ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు దారి తీసిన విషయాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్న మందకృష్ణ.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు పూజించే శ్రీకృష్ణుడు, యాదవులకు ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడు ఆనాడు తమ జాతికి చెందిన జాంబవంతుడు కుమార్తె జాంబవతిని వివాహమాడారని ఆయనకు లేని కుల వివక్ష ఇక్కడ యాదవులకు ఎందుకని ? మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎల్లంపల్లి గ్రామంలో దళితుడు ఎర్ర రాజశేఖర్ సోదరుడు యాదవ యువతిని ప్రేమించిన కారణంగా ఆ యువతి తండ్రి వెంకటేష్ ఒక యాదవుడని అతనికి తమ దైవం శ్రీకృష్ణ భగవానుడు గురించి తీయలేదని ప్రశ్నించారు. భగవంతుడే కులాలను విశ్వసించకుండా వివాహమాడినప్పుడు అప్పుడు యాదవ వంశ పెద్దలకు లేని వివక్ష ఇక్కడ సమాజంలో కుల వివక్ష ఎందుకు వచ్చిందని ఘాటుగా ప్రశ్నించారు. సమాజంలో పెట్రేగిపోతున్న కుల వివక్షను రూపుమాపడానికి హిందూ ధర్మ రక్షకులు, సనాతన ధర్మాన్ని కాపాడే వారు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భగవంతుడు సమాజంలో కుల మతాలకు అతీతంగా అందరిని సమానంగా చూడమని బోధించాడని మరి హిందూమతంలోని ఇలాంటి వివక్షలు పెరిగి చంపేందుకు కారణం అవుతుంటే వీటిపై మాట్లాడడానికి హిందూ ధర్మ రక్షకులు ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందని మందకృష్ణ సూచించారు. కుల వివక్ష కరోనా కంటే ప్రమాదకరమైనదని, కరోనా ను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఆ మహమ్మారిని పారద్రోలు ఎందుకు ఇలాంటి ప్రచార చర్యలు తీసుకున్నారు ప్రత్యేక నిధులు కేటాయించారు కుల వివక్షను కూడా రూపుమాపేందుకు అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల వివక్ష వెంటనే పోదని కాకపోతే రాబోయే భవిష్యత్తులో కచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications