మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై మంథని ఎంఏల్ఏ పుట్టమధు ఫిర్యాదు
హైదరాబాద్ :మాజీ మంత్రి శ్రీధర్ బాబు పై మంథని ఎంఏల్ఏ పుట్టమధు గురువారం నాడు డిజిపికి పిర్యాదు చేశారు. మాజీ నక్సలైట్, నయింతో శ్రీధర్ బాబుకు సంబందాలున్నాయనే విషయమై విచారణ జరిపించాలని ఆయన కోరారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ నక్సలైట్ నయింతో సంబందాలున్నాయని మంథని ఎంఏల్ఏ పుట్టమధు ఆరోపించారు.ఈ ఆరోపణలను మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఒకరిపై మరోకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో మంథని నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది.

పుట్ట మధు ఆరోపణలపై ాజీ మంత్రి శ్రీధర్ బాబు సవాల్ విసిరారు.అయితే నయింతో మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు సంబందాలున్నాయనే అంశంపై విచారణ జరిపించాలని కోరుతూ గురువారంనాడు మధు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మాజీ నక్సలైట్ నయింతో సంబందాల అంశం రాజకీయనాయకులకు ముచ్చెమటలు పోయిస్తోంది.నయింతో సంబందాలపై రాజకీయనాయకులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకొంటున్నారు.విచారణ జరిపించాలని పోలీసుఉన్నతాదికారులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications