సాహెబ్ నగర్ నాలాలో గల్లంతైన అంతయ్య మృతదేహం లభ్యం... ఎట్టకేలకు 7 రోజుల తర్వాత...
హైదరాబాద్లోని వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ నాలాలో ఏడు రోజుల క్రితం గల్లంతైన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడు అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. గల్లంతైన మ్యాన్ హోల్ నుంచి 350మీటర్ల దూరంలోని 12వ మ్యాన్ హోల్ వద్ద అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. కోయంబత్తూర్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో అంతయ్య మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం దానిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.
గత మంగళవారం అర్ధరాత్రి సమయంలో మ్యాన్ హోల్ శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులు అంతయ్య, శివ అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. శివ మృతదేహాన్ని అదే రోజు అధికారులు బయటకు తీశారు. కానీ అంతయ్య ఆచూకీ మాత్రం దొరకలేదు. గత ఏడు రోజులుగా అంతయ్య మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్తో పాటు జీహెచ్ఎంసీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రభుత్వం కోయంబత్తూర్ నుంచి స్పెషల్ టీమ్ను రంగంలోకి దింపింది. దీంతో ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యమైంది.
సాహెబ్నగర్, పద్మావతినగర్ కాలనీలో డ్రైనేజీ పైపు లైన్ జామ్ అవడంతో స్థానిక కాంట్రాక్టర్ స్వామి మ్యాన్హోల్ను శుభ్రం చేయించేందుకు చంపాపేటకు చెందిన అంతయ్య (45), చింతల్బస్తీకి చెందిన శివ (27) అనే కార్మికులను పిలిపించాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు అంతయ్య, శివను మ్యాన్హోల్లోకి దింపాడు. కొద్దిసేపటికే ఊపిరాడక శివ మృతిచెందగా, అంతయ్య గల్లంతయ్యాడు.

నిజానికి మాన్యువల్ స్కావెంజింగ్పై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ ఇలా మాన్యువల్ స్కావెంజర్లతో నాలాలను శుభ్రం చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక పరికరాలతో డ్రైనేజీలను క్లీన్ చేయించాల్సిందిపోయి ఇలా మనుషులను మ్యాన్ హోల్లోకి దింపడమేంటని పలువురు ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారి బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతులకు ప్రభుత్వం రూ.15లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వం తరుపున రూ.10లక్షలు,కాంట్రాక్టర్ తరుపున రూ.5లక్షలు ఇచ్చింది. ఇవిగాక మేయర్ గద్వాల విజయలక్ష్మి తన పరిధిలో ఉన్న నిధుల నుంచి రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications