సీఏఏ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో 4 న మిలియన్ మార్చ్ .. అదే సమయంలో ఓవైసీ కూడా భారీ ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా వ్యతిరేకత తెలియజేసిన అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణా రాష్ట్రంలోనూ సభలు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈనెల నాలుగున హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని భావిస్తున్న ర్యాలీలపై తెలంగాణలో చర్చ జరుగుతుంది.

4 న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్
ఇక ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో కూడా పలు దళిత విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు ఈ నెల 4 న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసన తెలియజెయ్యటానికి మిలియన్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు .కానీ పోలీసుల అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ఇక ఇదే రోజున ఓవైసీ కూడా భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించటంతో ఇప్పుడు తెలంగాణలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది.

సీఏఏ,ఎన్నార్సీకి వ్యతిరేకంగా పదిలక్షల మందితో ర్యాలీ
సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా సుమారు పది లక్షలమందితో డిసెంబరు 28 న మిలియన్ మార్చ్ జరపాలని భావించారు పలు సంఘాల నాయకుల జేఏసీ. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించటంపై పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ విచారించిన హైకోర్టు మిలియన్ మార్చ్ కు అనుమతించే విషయాన్ని పునః పరిశీలించవలసిందిగా పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తుంది .

అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ కూడా భారీ ర్యాలీ చేస్తుందని ప్రకటన
పలు సంఘాల జేఏసీ నిర్వహించ తలపెట్టిన ఈ భారీ ప్రదర్శనలో దళిత సంఘాలతో సహా విద్యార్ధిసంఘాలు, సామాజిక సంస్థలు, ముస్లిం సఘాలు , వివిధ జిల్లాల నుంచి ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ ర్యాలీ అనుమతి కోసం వారు నిరీక్షిస్తున్నారు. ఇక ఇదే సమయంలో సీఏఎకు నిరసనగాఇప్పటికే నిజామాబాద్ వేదికగా సభ పెట్టిన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు .

ర్యాలీల కోసం పోలీసుల అనుమతులు ..ఏం జరుగుతుందో
ఇందుకు నగర పోలీస్ కమీషనర్ అనుమతిని కోరుతున్న వారు ర్యాలీ రూట్ గురించి కూడా వివరించారు . చార్మినార్ నుంచి ధర్నా చౌక్ వరకు ఒక మార్గంలోనూ, దారుస్సలాం నుంచి ఈద్ గా బిలాలి వరకు మరో మార్గంలోనూ మార్చ్ నిర్వహిస్తామని చెప్తూనే మరో మార్గాన్ని కూడా తాము పోలీసులకు సూచించినట్టు తాము నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈనెల 4 లేదా 5 తేదీల్లో భారీ ర్యాలీ నిర్వహించాలన్న ఆలోచనలో ఎంఐఎం కూడా ఉన్న నేపధ్యంలో మిలియన్ మార్చ్ ఎంఐఎం పార్టీ ర్యాలీ క్లాష్ అయ్యే వకాశం ఉంది. మరి వీరి ర్యాలీలకు పోలీసుల అనుమతి లభిస్తుందా ? అనేది వేచి చూడాలి .
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications