వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌లో ప్రమాదం, ఢీకొన్న కార్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌లో బుధవారం ఉదయం ప్రమాదం స్వల్ప జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరిన ఈటెల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.

ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఓ కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మంత్రి ఈటెల సహా ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకున్నారు. మంత్రి సహా ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Minister Etela Rajender's convoy meets with accident in Karimnagar district

మంత్రి ఈటెల ఈ రోజు కరీంనగర్ నుంచి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో వెళ్తుండగా మెట్‌పల్లి వద్ద ఈ సంఘటన జరిగింది.

English summary
Minister Etela Rajender's convoy meets with accident in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X