మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి KTR పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ మేరకు కేసు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి
KTR దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు కేసు విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 2 న నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ , సినీనటి సమంత విడాకుల విషయంలో కేటీఆర్ పై కొండా సురేఖ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. మరోవైపు ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications