మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి KTR పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ మేరకు కేసు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి
KTR దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు కేసు విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 2 న నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ , సినీనటి సమంత విడాకుల విషయంలో కేటీఆర్ పై కొండా సురేఖ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. మరోవైపు ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.












Click it and Unblock the Notifications