మంత్రి జగదీష్ రెడ్డికి తప్పిన ప్రమాదం, కాన్వాయ్ వాహనం ఢీకొని 5 గురికి గాయాలు
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బటయపడ్డారు.
నల్లగొండ: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బటయపడ్డారు.
హైద్రాబాద్ నుండి కేతెపల్లిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నాడు మంత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపుతప్పి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.మంత్రికి వరుసకు సోదరుడయ్యే కరుణాకర్ రెడ్డి గాయపడ్డారు.
మంత్రి అటెండర్ లింగయ్య, భద్రతాధికారి అవినాష్ రెడ్డి, డ్రైవర్ కృష్ణ,గడ్డిపల్లికిచెందిన సత్యం గాయపడ్డారు. వీరందరిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

మంత్రి హైద్రాబాద్ నుండి కేతెపల్లి వెళ్తుండగా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెం వద్ద ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదం నుండి మంత్రి జగదీష్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications