మోయలేని భారం మోపేవాడే మోడీ: మహిళల వంటింటినుండే బీజేపీ పతనం షురూ: మంత్రి కేటీఆర్
కేంద్రంలోని అధికార బీజేపీని పదేపదే టార్గెట్ చేసే తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా బిజెపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచి, సామాన్యులపై పెను భారం మోపుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆదాయాలు పాతాళంలో, ధరలు ఆకాశంలో ఉంటాయంటూ తనదైన శైలిలో టార్గెట్ చేశారు.

బీజేపీ పతనం మహిళల వంటింటి నుండే షురూ
రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేసి పేద మధ్యతరగతి మహిళలవంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ అవుతుందని తేల్చి చెప్పారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తారు, కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా? అంటూ ప్రశ్నించారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 (NOT-OUT) అయినా ఇంకా పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆడపిల్లలపై పెను భారం మోపుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

పేదవాడి పొట్ట కొట్టడం, మళ్లీ వాళ్ల చేతిలో పొగగొట్టం పెట్టటం.. బీజేపీ చేసేదిదే
గ్యాస్ ధర వెయ్యి అయ్యింది, పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును టార్గెట్ చేసిన కేటీఆర్ పేదవాడి పొట్ట కొట్టడం, మళ్లీ వాళ్ల చేతిలో పొగగొట్టం పెట్టడమే అంటూ నిప్పులు చెరిగారు. సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి, ఇప్పుడు 3 సిలిండర్లజపం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు సిలిండర్లతోమూడుపూటలా వంట సాధ్యమా అని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ మోయలేని భారం మోపే వాడే మోడీ అని మహిళాలోకానికి అర్థమైంది అంటూ తేల్చి చెప్పారు.

ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట
మోడీ పాలనలో ఆయిల్ కంపెనీలకు కాసుల పంట పండుతుందని, కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట మండుతుంది అని నిప్పులు చెరిగారు. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవు అంటూ ప్రశ్నించిన మంత్రి కేటీఆర్, మోడీ పాలనలో ధరలు ఆకాశంలో ఉన్నాయని, ఆదాయాలు మాత్రం అందుకోలేనంత పాతాళంలో ఉన్నాయని పేర్కొన్నారు. గరీబోళ్ల గుండెలపై గ్యాస్ బండలు గుదిబండలుగా మారుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అందుకే పేద, మధ్య తరగతి మహిళల వంటింట్లో నుండి బీజేపీ పతనం షురూ అవుతుందంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications