Farmers: రైతులకు శుభవార్త.. రెండు రోజుల్లో పంటనష్ట పరిహారం..!
తెలంగాణలో మార్చిలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని అప్పుడే నిర్ణయించింది. వ్యవసాయ అధికారుల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసింది. తాజాగా పంట నష్ట పరిహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
పంట నష్ట పరిహారం ఒకటి, రెండు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోని పది జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసింది.

ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.15.81 కోట్లను పరిహారం కింద రైతులకు చెల్లించడానికి ఏర్పాట్లు చేసినట్లు తమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరింది.
రైతులను దృష్టిలో ఉంచుకుని పంట నష్ట పరిహారం బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం పంట నష్ట పరిహారం విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..?












Click it and Unblock the Notifications