నెలల తరబడి కూతురిపై తండ్రి అత్యాచారం: పరారీ
మహబూబ్నగర్: ఓ బాలిక పాలిట కన్నతండ్రే కీచకుడిగా మారి చెరబట్టాడు. ఏడో తరగతి చదువుతున్న అమ్మాయిపై తండ్రి కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆ బాలికకు పోలీసులు గురువారంనాడు విముక్తి కలిగించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం గ్రామంలో చోటు చేసుకుంది.
తాను అనుభవిస్తున్న నరకాన్ని బాలిక తన పాఠశాల టీచర్కు చెప్పింది. సమాచరాం అందుకున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పోలీసుల సహాయంతో ఆమెను రక్షించింది. బాలికపై తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అతను పరారీలో ఉన్నాడు.
కేసు నమోదు చేసుకున్న బిజినేపల్లి పోలీసులు బాలికను మహబూబ్నగర్లోని బాలల సంక్షేమ గృహానికి పంపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. రంగాపూర్, పెబ్బేర్ పోలీసు స్టేషన్లకు కూడా సమాచారం అందించి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తల్లి కూడా విషయం తెలుసునని, అయితే ఆ విషయాన్ని ప్రశ్నిస్తే అతను ఆమెను కొట్టేవాడని చెబుతున్నారు. బాధితురాలికి ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నిందితుడి భార్య అతని వేధింపులు తట్టుకోలేక పాలెం వచ్చింది. తన పూర్వీకుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో కేర్ టేకర్గా పనిచేస్తోంది.
అయితే, గత ఆరు నెలలుగా నిందితుడి ఇంటికి వస్తూ బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. నిందితుడు తమను నగ్నంగా చూడాలని బలవంతం చేసేవాడని తల్లితో పాటు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications