పేద మహిళ కోసం మళ్లీ డాక్టర్ గా మారిన ఎమ్మెల్యే.. ఆపరేషన్ సక్సెస్
ప్రజా సేవే లక్ష్యంగా పలు వృత్తులలో ఉన్న వారు సైతం రాజకీయాల్లో రాణించడం సహజమే. అయితే ఓ పేద మహిళ కోసం మళ్లీ డాక్టర్ గా మారాడు ఓ ఎమ్మెల్యే. ఒంటిపై ఆఫ్రాన్ వేసుకుని.. చేతిలో కత్తెర పట్టుకుని స్వయంగా ఓ అరుదైన ఆపరేషన్ చేసి.. ఓ పేద మహిళకు అరుదైన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేసి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
డాక్టర్ వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో.. అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కూడా ఒకరు. ఎప్పుడూ రాజకీయాలే కాకుండా.. అప్పుడప్పుడు తమ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఆ రకంగా కూడా ప్రజాసేవ చేస్తూ ప్రజలతో నీరాజనాలు పొందుతారు. లేటెస్ట్ గా ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గం మొత్తం వ్యాపించింది. దీంతో ఎమ్మెల్యే చేసిన పనికి ప్రజలు సైతం ఎమ్మెల్యేను కొనియాడుతున్నారు.

చారకొండ మండలానికి చెందిన గోరేటి లక్ష్మమ్మ.. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించుకోగా కడుపులో కణితి ఉందని ఆపరేషన్ చేసి తీసేయ్యాలని సూచించారు. అయితే అందుకు బాగా ఖర్చవుతుందని చెప్పటంతో లక్ష్మమ్మ వైద్యం చేయించుకోకుండానే ప్రైవేటు హాస్పిటల్ నుంచి వెనుదిరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏరియా ఆస్పత్రిలో రెండోసారి నిర్వహించిన సర్జికల్ క్యాంపులో లక్ష్మమ్మ పాల్గొన్నారు.
తన అనారోగ్య పరిస్థితి గురించి వంశీకృష్ణకు విన్నవించుకుంది. లక్ష్మమ్మ పేదరికాన్ని అర్ధం చేసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.. ఏరియా ఆస్పత్రి వైద్యులతో కలిసి లక్ష్మమ్మకు ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే లక్షల్లో ఖర్చయ్యేవని.. కానీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారని లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications