హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్: చర్లపల్లి జైలుకు, పీడీ యాక్ట్ నమోదు, మార్కెట్ బంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను వెస్ట్ జోన్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి భారీగా బలగాలతో వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

రాజా సింగ్ అరెస్ట్: భారీగా పోలీసుల మోహరింపు

రాజా సింగ్ అరెస్ట్: భారీగా పోలీసుల మోహరింపు

ఇంట్లోనే ఉన్నానంటూ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, అరెస్ట్ సందర్భంగా రాజా సింగ్ అభిమానులు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. రాజా సింగ్‌కు మద్దతుగా, కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీ యాక్ట్: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి

ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీ యాక్ట్: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి

కాగా, రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. చర్లపల్లి జైలుకు రాజా సింగ్‌ను పోలీసులు తరలించారు. 2004 రాజాసింగ్ పై 101 కేసులు నమోదయ్యాయని, ఇందులో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మునావర్ షారూఖీ వల్లే తాను వీడియో చేయాల్సి వచ్చిందన్న రాజా సింగ్

మునావర్ షారూఖీ వల్లే తాను వీడియో చేయాల్సి వచ్చిందన్న రాజా సింగ్

మునావర్ ఫారూఖీ వల్లే హైదరాబాద్‌లో కమ్యూనల్ వాయిలెన్స్ జరిగాయని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. రాముడు, సీతను తిట్టే వ్యక్తిని హైదరాబాద్ తీసుకురావొద్దని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీకి తాను విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవాలని మండిపడ్డారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారుఖీ అని వెల్లడించారు. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని తెలిపారు. ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంమని చెప్పారు. తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. పోలీసులకు ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తానని వివరించారు. పాతబస్తీలో ఆందోళనలకు కారణం ఎంఐఎం నేతలేనన్నారు రాజాసింగ్. పోలీసులపై గతంలో దాడికి పాల్పడిన ఎంఐఎం నేతలకు రక్షణ ఉందన్నారు. పోలీసులు ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగానే మునావర్‌ను రప్పించారని రాజా సింగ్ ఆరోపించారు.

పోలీసుల నోటీసులు: రాజా సింగ్ ఘాటు స్పందన

పోలీసుల నోటీసులు: రాజా సింగ్ ఘాటు స్పందన

ఎమ్మెల్యే రాజాసింగ్‌​కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళ్‌​హాట్, షాహినాయత్ గంజ్ పీఎస్​లలో నమోదైన కేసులలో వేర్వేరుగా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిభ్రవరి 19న మంగళ్‌​హాట్ పీఎస్‌​లో రాజాసింగ్‌​పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళ్ ​హాట్ పీఎస్‌​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ​పై పోలీసులు కేసు నమోదు చేశారు. షాహినాయత్ గంజ్ ఠాణా​లోనూ ఏప్రిల్ 12న మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా పాట పాడారని, ఎస్సై రాజేశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షాహినాయత్ గంజ్ ఠాణాలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసులలోనూ పోలీసులు గురువారం ఉదయం 11 గంటల సమయంలో రాజాసింగ్‌​కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయడంతో.. మరోసారి తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

ఆర్నెళ్ల క్రితం కేసులు నమోదైతే.. పోలీసులు ఇన్ని రోజులు ఏం చేశారని, నిద్ర పోతున్నారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సదరు వీడియో వైరల్​ కావటంతో.. రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్​ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గపు యువత.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం రాజాసింగ్‌​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ను గురువారం మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు.

రాజా సింగ్ అరెస్టుకు నిరసనగా మార్కెట్ బంద్, ఆందోళన

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌​కు నిరసనగా నగరం​లోని బేగంబజార్ మార్కెట్​ వ్యాపారులు బంద్ చేశారు. అతనిపైన అక్రమంగా పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారని ఆందోళనకు దిగారు. నగరంలోని బేగంబజార్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ తదితర ప్రాంతాల్లో మార్కెట్లలో దాదాపు 1000 దుకాణాల వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రాజాసింగ్‌​కు మద్దతుగా నిలిచారు. బేగంబజార్​లో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్​కు నిరసనగా గోషామహల్ నియోజకవర్గ వర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎంజే మార్కెట్ కూడలి వద్ద రాజాసింగ్ అభిమానులు సీఎం కేసీఆర్‌​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary
MLA Raja Singh arrested for his controversial comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X