కేసీఆర్! అంతా మీ వల్లే: పేదల బాధ చూడలేక పదవికి రాజాసింగ్ రాజీనామా!
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోధ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోధ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు.
దూల్పేటలో గుడుంబా అరికడుతున్నందుకు పేదలకు పునరావాసం, ఉపాధి కల్పించాలని లేఖలో కోరారు. దూల్పేటలో సీఎం కేసీఆర్ పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు.

పేదరికాన్ని చూడలేకపోతున్నానని, కొందరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని రాజాసింగ్ లోధ్ పేర్కొన్నారు.
దీనికి అంతటికి మీ పాలనే కారణమన్నారు. పరిస్థితిని చూడలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.
దూల్ పేట ప్రజలకు మంచి చేస్తానని సీఎం చెప్పారని, కానీ ఇచ్చిన మాట తప్పారని రాజాసింగ్ ఆరోపించారు. సీఎం మాట విని అందరు సారా వ్యాపారం మాని, ఇప్పుడు రోడ్లపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు ప్రత్యామ్నాయం దొరకలేదన్నారు. తనకు ఓటర్ల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. మంత్రులు,అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications