తెలంగాణాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ ... కేసీఆర్ కు హుజురాబాద్ ఎఫెక్ట్ !!
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామా చేయడం టీఆర్ఎస్ పార్టీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందా ? హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కూడా అధికార పార్టీని ఇబ్బంది పెడుతుందా? అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రాజీనామాల డిమాండ్ వినిపిస్తుందా ? ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని ప్రజలు భావిస్తున్నారా ? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.

హుజురాబాద్ లో తాజా అభివృద్ధి రాజీనామా వల్లే .. టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షం
హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ సమయంలో హుజురాబాద్ కు నిధుల వరద పారింది. అభివృద్ధి పనులలో హుజురాబాద్ దూకుడు చూపిస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి తన వల్లే అభివృద్ధి జరుగుతుందని, తన రాజీనామా వల్లనే అభివృద్ధి చేస్తున్నారని ఈటెల రాజేందర్ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక వైయస్ షర్మిల, విజయశాంతి వంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయి. ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అంటూ షర్మిల,విజయశాంతి ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ .. భూపాలపల్లి ఎమ్మెల్యేకు రాజీనామా డిమాండ్
హుజురాబాద్ లో తాజా పరిణామాల నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గం గండ్ర వెంకటరమణా రెడ్డి హయాంలో అభివృద్ధి చెందడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈటల రాజేందర్ ను చూసి నేర్చుకోవాలని రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళితే అయినా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు . రమణా... రాజీనామా చెయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు .

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు
గండ్ర వెంకటరమణా రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భూపాలపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి, అప్పుడు తెలంగాణ స్పీకర్ గా పనిచేసిన సిరికొండ మధుసూదనా చారి మీద విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా డిమాండ్
ఇటీవల బిజెపి నాయకులు గుంతల మయం అయిన రోడ్లపై పువ్వులు చల్లి, గుంతలకు పుష్పాభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే అయినా సీఎం కేసీఆర్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇదే సమయంలో నల్గొండ జిల్లాలోనూ రాజీనామా కోసం డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తోంది.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పైనా నిరసన .. రాజీనామా డిమాండ్
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాజీనామా చేస్తే నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి అవుతుందని డిమాండ్ వినిపిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ రాజీనామాతో సీఎం కేసీఆర్ ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా నల్గొండ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు వరకు కనీసం నల్గొండ వైపు కూడా చూడలేదని, ఈ రెండేళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు.

హుజురాబాద్ ఎఫెక్ట్ .. అభివృద్ధి జరగని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు
బాధ్యతగల ఎమ్మెల్యేగా అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అనేక నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఫిరాయింపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామాతో మొదలైన రగడ, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రాజీనామాల అస్త్రంతో హాట్ టాపిక్ గా మారింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications