బోధన్ ఎమ్మెల్యే నామినేషన్కు స్కూటీపై మ్మెల్సీ కవిత: అంబులెన్స్లో వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరొక్కరోజే గడువు ఉండటంతో గురువారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈరోజే గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.
Due to traffic jams in Bodhan due where MLA #Shakeel was filing his nomination, MLC #Kavitha took a scooty ride to reach the venue, the starting point of a march @RaoKavitha @BRSparty pic.twitter.com/GcJ0YuXsYg
— Naveen S Garewal (@naveengarewal) November 9, 2023
కాగా, బోధన్ బీఅర్ఎస్ అభ్యర్థిగా షకీల్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కాసేపు స్కూటీపై కవిత ప్రయాణించి కార్యకర్తల్లో జోష్ నింపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నామినేషన్ అనంతరం కవిత మాట్లాడారు.

బోధన్ నామినేషన్ ముందు నిర్వహించిన భారీ ర్యాలీ విజయయాత్రతో తప్పక గెలుస్తారని కవిత అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు అందరూ ఓటు వేయాలని.. దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టించారలని ప్రజలను కోరారు. కాగా, నామినేషన్ల ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబులెన్స్లో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో గత 10 రోజులుగా హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.
దుబ్బాకలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొత్త ప్రభాకరన్న...
— Kotha Prabhakar Reddy (@KPRTRS) November 9, 2023
అనంతరం ఏర్పాటుచేసిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన మంత్రి @BRSHarish గారు...
మన ప్రభా "కారు" కే వొటేద్దాం..
దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం...
మన దుబ్బాక.. మన ప్రభాకరన్న... మన బిఆర్ఎస్… pic.twitter.com/0YcMWkGovD

ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్ దిగిన తర్వాత వీల్ చైర్లో రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్కు సమర్పించారు. అంతకుముందు దుబ్బాక పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను హరీశ్ రావు కోరారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications