బోటు ప్రమాదంపై మోహన్ బాబు: వారి కక్కుర్తి 20 మంది ప్రాణాలు తీసింది!
విజయవాడలో పవిత్ర సంగమం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవైకి చేరింది. ఈ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు.
హైదరాబాద్/అమరావతి: విజయవాడలో పవిత్ర సంగమం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవైకి చేరింది. ఈ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు.
Recommended Video

దిగ్భ్రాంతిని కలిగించింది
ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

నిలిచిన నవహారతులు
2 నిమిషాల్లో క్షేమంగా ఒడ్డుకు చేరాల్సిన సమయంలో ఎన్నో కుటుంబాల్లో బోటు ప్రమాదం విషాదం నింపింది. ఈ విషాధ ఘటనతో పవిత్ర సంగమంలో జరగాల్సిన నవహారతులు నిలిచిపోయాయి. కార్తీక మాసం, పైగా ఆదివారం కావడంతో హారతులను తిలకించేందుకు పెద్ద ఎత్తున పవిత్ర సంగమానికి వచ్చారు. హారతి ఏర్పాట్లు జరుగుతుండగానే బోటు తిరగబడటంతో నవ హారతులు నిలిపివేశారు.

నా భార్య పుట్టింటి వారు ముగ్గురు మృతి చెందారు
పడవ ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ ప్రమాదంలో తన భార్య పుట్టింటికి చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందారన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం పూర్తిగా నిర్వహణ లోపమే అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేసినా
రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్స్ సంస్థ పర్యాటకలు ఒక్కొక్కరి నుంచి రూ.300 టిక్కెట్టు వసూలు చేసింది. అయినా కేవలం రూ.40 వేలు వెచ్చించలేకపోయారు. దీంతో దాదాపు 20 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. బోట్లలో ప్రయాణించే వారికి అవసరమైన కనీస లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచలేకపోయారు.

అలా ప్రాణ నష్టం తగ్గేది
బోటు ఎక్కేటప్పుడే పర్యాటకులు లైఫ్ జాకెట్లు గురించి అడిగినా వాటి అవసరం లేదని నిర్వాహకులు చెప్పారు. బోట్లో అవి కావాల్సినన్ని అందుబాటులో ఉండి, పర్యాటకులు వాటిని ధరించి ఉంటే ప్రమాదం జరిగినా, ప్రాణనష్టం తగ్గి ఉండేది. ఏపీ పర్యాటక శాఖ బోటు విహారానికి రూ.60 మాత్రమే వసూలు చేస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications