వడ్డీ వ్యాపారి అరాచకం, యజమాని ఇంట్లో లేని సమయంలో ఏం చేశాడంటే...
సిరిసిల్ల: తన వద్ద తీసుకున్న అప్పు తీర్చలేదనే కారణంతో ఓ వడ్డీ వ్యాపారి యజమాని ఇంట్లో లేని సమయంలో అతడి కుటుంబాన్ని ఇంట్లోనే నిర్బంధించిన ఉదంతమిది. ఈ అరాచక ఘటన సిరిసిల్లలోని సుభాష్నగర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... సిరిసిల్లలోని సుభాష్నగర్కు చెందిన కృష్ణహరి అనే వస్త్ర వ్యాపారి ఆంజనేయులు అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోయాడు.
దీంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయులు... కృష్ణహరి ఇంట్లో లేని సమయంలో అతడి ఇంటికి వచ్చాడు. కృష్ణహరి కుటుంబ సభ్యులు లోపల ఉండగానే ఇంటికి బయట తాళం వేసి వెళ్లిపోయాడు.

తన భర్త ఇంట్లో లేని సమయంలో ఆంజనేయులు వచ్చి తమను వేధిస్తున్నాడని కృష్ణహరి భార్య పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా బయటనుంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి వ్యక్తులెవరూ వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే ఇందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది ఉండాలి. మరి ఆంజనేయులు అనధికార వడ్డీ వ్యాపారా? లేక అధికారికంగానే ఆ వ్యాపారం చేస్తున్నారా? ఇది పోలీసులే తేల్చాలి.
ఇప్పటికే అక్రమ వడ్డీ వ్యాపారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఒక చట్టాన్ని చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications