అప్పు తీర్చలేదని ఇంటికి తాళం .. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
ఎల్లారెడ్డిపేట : అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న 49 మందిపై రామగుండం పోలీసులు కొరఢా ఝులిపిన సంగతి మరవకముందే .. సిరిసిల్లా జిల్లాలో మరొ ఘటన వెలుగుచూసింది. చేసిన అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారి ఇంటికి తాళం వేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు కలుగజేసుకొని .. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
రూ.2 వడ్డీకి నగదు
సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పారూర్ కు చెందిన ఒడ్డె శాంతవ్వ వడ్డీ వ్యాపారం చేస్తుంది. గ్రామానికి చెందిన మహ్మద్ ముస్తాఫాకు 2 రూపాయల వడ్డీ కింద రూ.2.10 లక్షలు అప్పు ఇచ్చింది. 15 నెలలు అవుతున్న వడ్డీ ఇవ్వడం లేదు. అసలు మాటే ఎత్తితే రేపు మాని అని కాలం దీస్తున్నాడు. వాస్తవానికి ముస్తాఫాకు రావాల్సిన నగదు రాలేదు. దీంతో అతను ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. వాయిదా ప్రకారం శాంతవ్వ డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీంతో కుటుంబసభ్యులను బయటకు పంపించేసి ఇంటికి తాళం వేశారు.

ఇవ్వకపోవడంతో ఇంటికి తాళం
స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. శాంతవ్య, ముస్తాఫాతో మాట్లాడాారు. ఇరువర్గాలును సముదాయించి .. నచ్చజెప్పారు. వాయిదా పద్దతిలో డబ్బు ఇస్తానని ముస్తాఫా చెప్పాడు. ఇందుకు శాంతవ్వ కూడా అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. వారిద్దరూ మరో కాగితం రాయించి .. వారిని ఇంటికి పంపించేశారు పోలీసులు. అయితే వడ్డీ వ్యాపారితో జరిగిన గొడవను త్వరగానే ఎస్సై ప్రవీణ్ కుమార్ తేల్చేశాడని స్థానికులు చెప్తున్నారు. సమస్యను పరిష్కరించిన ఎస్పైను పలువరు ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications