హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్య: ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో నలిగి తల్లీకూతుళ్ల మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి శుక్రవారం ఉదయం బయల్దేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మంద్రమర్రి-మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ క్రమంలో రైలు నుంచి దూకిన వారిద్దరూ రైలు చక్రాల్లో ఇరుక్కుపోయారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా జరిగిన ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన రైల్వే సిబ్బంది మంచిర్యాలలో రైలును ఆపేశారు.

ఆ తర్వాత ఇంజన్‌లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. మంచిర్యాల జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో గుర్తుతెలియని మహిళతో పాటు ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించామన్నారు.

Mother and Daughter Attempts Suicide Jumps off AP Express

లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. దీంతో వారిద్దరి మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాలను తీసిన అనంతరం రైలు 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Mother and Daughter Attempts Suicide Jumps off AP Express.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X