ముస్లిం ఫోరం సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ... సీఏఏ, ఎన్ఆర్సీల అమలుపై ఓవైసీ బ్రీఫింగ్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఏఏ అమలు ఇతర అంశాలు చర్చించేందుకు ఆయన యునైటైడ్ ముస్లిం ఫోరం సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. మధ్యహ్నాం మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.
సమావేశం అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఆర్సీతో పాటు సీఏఏ ను వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ను కోరినట్టు తెలిపారు. వాటిని రాష్ట్రంలో అమలు చేయవద్దని సీఎంకు లేఖ సమర్పించినట్టు చెప్పారు. దీంతో తాము చేసిన విజ్ఝప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని.. ఈనేపథ్యంలోనే అయితే వీటి అమలుకు ఇతర రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారని ఓవైసీ ప్రకటించారు.

కాగా కేంద్ర చట్టాలపై ఈ నెల 27న నిజమాబాద్లో బహిరంగ సభను నిర్వహిస్తామని ఎంపీ అసదుద్దిన్ ప్రకటించారు. కాగా ముస్లీం ఫోరం సమావేశంలో అసదుద్దిన్ తో పాటు రాష్ట్ర హోమంత్రి మహమూద్ ఆలీ , ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు అక్పరుద్దిన్ , పాషా ఖాద్రీలు సైతం పాల్గోన్నారు.












Click it and Unblock the Notifications