Seethakka: జనంలోనే సీతక్క.. ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే..
ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో అడవి బిడ్డల కోసం కొండడలు, కోనలు ఎక్కారు. వారికి సాయం చేశారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాజాగా తన నియోజకవర్గ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుండగా వారి బాగోగులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెబుతూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కారు వెళ్లిలేని ప్రాంతంలోకి కూడా సీతక్క వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతక్క గురువారం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియతిరిగారు. మోకాలి లోతు వరద నీటిలో నడుచుకుంటూ బాధితులను కలిశారు. నేనున్నాంటూ భరోసానిచ్చారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా వరదలు వచ్చాయి. వరదల్లో 9 మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వరదలో గల్లంతై మృతి చెందారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications