Seethakka: జనంలోనే సీతక్క.. ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే..
ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో అడవి బిడ్డల కోసం కొండడలు, కోనలు ఎక్కారు. వారికి సాయం చేశారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాజాగా తన నియోజకవర్గ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుండగా వారి బాగోగులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెబుతూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కారు వెళ్లిలేని ప్రాంతంలోకి కూడా సీతక్క వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతక్క గురువారం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియతిరిగారు. మోకాలి లోతు వరద నీటిలో నడుచుకుంటూ బాధితులను కలిశారు. నేనున్నాంటూ భరోసానిచ్చారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా వరదలు వచ్చాయి. వరదల్లో 9 మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వరదలో గల్లంతై మృతి చెందారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications