Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగార్జున సాగర్ డ్యాం భద్రత ఎస్పీఎఫ్ చేతికి, ఎందుకంటే?

నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై ఇప్పటి వరకు భద్రత కోసం ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు ఆ బాధ్యత నుంచి వైదొలగాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ డ్యాంను తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి తీసుకుంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జున సాగర్ డ్యాంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ 3న నాగార్జున సాగర్ ఏపీ, తెలంగాణ రెండు వైపులా కేంద్ర బలగాలు మోహరించాయి. నాగార్జున సాగర్ ను తమ ఆధీనంలోకి తీసుకుని భద్రత విధులు నిర్వహించాయి.

Nagarjunasagar Dam security handed over to SPF CRPF withdraws

ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు. కాగా, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణే చూస్తుందని.. వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరింది.

ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం భద్రత కేఆర్‌ఎంబీ ఆధీనంలో ఉండటంతో సీఆర్పీఎఫ్ బలగాలతో నిఘాలో ఉంది. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన రావడంతో సీఆర్పీఎఫ్ నుంచి భద్రతపరమైన చర్యలను ఎస్పీఎఫ్‌కు అప్పగించారు. ఇక, భద్రత విధుల నుంచి కేంద్ర బలగాలను ఉపసహరించాలని నిర్ణయం తీసుకోవడంతో తాజాగా వెనక్కి వెళ్లిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+