ఆమె తెలుసా అంటే జవాబు చెప్పని నామా: మౌనం వీడి ఇలా...
ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మౌనం వీడారు. సుంకర సుజాత అనే మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయ
అమరావతి: ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మౌనం వీడారు. సుంకర సుజాత అనే మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు.
చదవండి: చిక్కుల్లో నామా: నగ్నచిత్రాలున్నాయని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపణ
తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన శనివారం ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన చెప్పారు. తన గురించి అందరికీ తెలుసునని అన్నారు.

మీపై కేసు పెట్టిన సుజాతా రామకృష్ణన్ మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగితే సమాధానం చెప్పకుండా నామా వెళ్లిపోయారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏం జరిగిందో తనకు తెలియదని, ఎవరో చెప్తే విన్నానని ఆయన అన్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని, చట్టపరంగా ఎదుర్కుంటాని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications