హరికృష్ణ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ భవన్ ఎందుకు తీసుకు వెళ్లలేదంటే?
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించాలని తొలుత భావించారు. కానీ స్మశాన వాటికకు వెళ్లేముందు భౌతికకాయానికి స్నానం చేయించాల్సి ఉంది. టీడీపీ కార్యాలయానికి తీసుకు వెళ్తే మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకు రావాల్సి ఉంటుంది.
ఇదంతా ఇబ్బందితో కూడిన వ్యవహారమని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకు వెళ్లలేదు. హరికృష్ణను బుధవారం తొలుత మెహిదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకు వెళ్లాలని భావించారు. కానీ ఆ తర్వాత అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచారు.

ఇదిలా ఉండగా, హరికృష్ణ అంతిమయాత్ర ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి చేరుకుంది. హరికృష్ణ అంతిమ సంస్కారాలకు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. హరికృష్ణ పార్థివదేహంపై టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో చాలామంది పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications