హైఫై మహిళలు టార్గెట్: మేల్ ఎస్కార్ట్స్ సరఫరాలో నందిని చౌదరి హ్యాండ్?
హైదరాబాద్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వహిస్తున్న నందిని చౌదరి వ్యవహారాలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఆమెపై పలు చీటింగ్ కేసులో నమోదవుతుండగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు యువకులను వారికి మేల్ ఎస్కార్ట్స్గా పంపించడంలోనూ ఆమె పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆభరణాలు అమ్మి పెడతానని నమ్మించి మోసానికి పాల్పడ్డ కేసులో జైలు పాలైన నందినీ చౌదరీ చేతిలో మోసపోయిన బాధితులు పెద్దసంఖ్యలోనే ఉన్నట్లు పోలీసులకు వస్తున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది.జూబ్లీహిల్స్ రోడ్ నెం రోడ్ నెం 72లోని బ్లష్ ఇంటర్నేషన్ లగ్జరీ స్పా నిర్వహిస్తున్న విజయవాడకు చెందిన నందినీ చౌదరి తన వద్దకు వచ్చే సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు,వ్యాపారులే టార్గెట్గా పలు మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.
తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నందినీచౌదరి చేతిలో మోసపోయిన ఇద్దరు వ్యక్తులనుంచి ఫిర్యాదులు అందుకున్నారు.ఇప్పటికే నందినీ చౌదరి నాంపల్లి, పంజాగుట్ట పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ఆమెపై సీసీఎస్లోనూ కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తన వద్దకు వచ్చే సంపన్న మహిళలకు ఆభరణాలు ఇప్పిస్తానంటూ మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం రిమాండ్లో ఉన్న నందినీ చౌదరిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించగా బంజారాహిల్స్రోడ్ నెం 12లోని ఓ కాంగ్రెస్ నేత బెదిరించడంతో రూ.10లక్షల విలువైన నెక్లెస్ను ఇచ్చినట్లు చెప్పింది.
అయితే ఒక్కరోజుతోనే కస్టడీ ముగియడంతో చాలా విషయాలను రాబట్టలేకపోయామని,కస్టడీకి ఇస్తే మరింత మంది బాధితులు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. నందినీ చౌదరి దాదాపు పాతిక మంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్ను సరఫరా చేసి భారీ డబ్బులు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.