పీవీ కూల్చివేత యత్నాలు జరిగాయి: హాఫ్ లయన్లో సంచలనం
ఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహా రావు పైన కాంగ్రెస్ పార్టీ నిర్దయగా వ్యవహరించిందని, ముస్లీంల ఓట్లను ఆకట్టుకునేందుకు ఆయన పైన నింద మోపిందని 'హాఫ్ లయన్' పుస్తకంలో రచయిత వినయ్ సీతాపతి ఆరోపించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో పీవీ పాత్రను ఆయన సమర్థించారు. కూల్చివేత చర్యలను పీవీ ఉద్దేశ్యపూర్వకంగా నిలువరించలేదనే ఆరోపణలు సరికాదని ఆ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. హాఫ్ లయన్ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీతాపతి మాట్లాడారు. బాబ్రీ కూల్చివేతతో పాటు పీవీ కూల్చివేత యత్నాలు జరిగాయన్నారు. ముస్లీం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ పీవీ పైన నింద మోపిందన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్రంగా స్పందించారు.
ముప్పును గుర్తించేలా ప్రధానిని మేల్కొలిపేందుకు తాము ప్రయత్నించటామని, ఆయన తిరస్కరించారని విమర్శించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... పీవీ దేశానికి చేసిన మంచి ఆయన తర్వాత కూడా సజీవంగా ఉందన్నారు. కూల్చివేత సమయంలో పీవీలోని సంశయాల్ని రాజ్యాంగపరమైన అంశాలు కాకుండా రాజకీయాలు ప్రేరేపించాయన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications