ప్రధాని సోదరుడికి నిజామాబాద్లో ఘనస్వాగతం
నిజామాబాద్: డిచ్పల్లి మండలం బర్దపూర్ గ్రామ పరిధిలోని అమృతాగార్డెన్కు వచ్చిన నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీకి రాష్ట్ర గాండ్ల తేలికుల సంఘం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఆయన గురువారం హైదరాబాద్ నుంచి నాందేడ్కు వెళ్తుండగా మార్గమాధ్యలో ఇక్కడ కాసేపు ఆగారు.
ఈ మేరకు గాండ్ల తేలికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇందల్వాయి కిషన్ నేతృత్వంలో సంఘం నాయకులు ప్రహ్లాద్ మోడీని కలిశారు. వారి సంఘం కాలమానిని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

గాండ్ల తేలికుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వచ్చిన పర్యటన బృందం ప్రకాష్ రాథోడ్ మోడీ, హుకుమ్ సాహూ, కోర్పోల్ ప్రవీణ్ మోడీ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నర్సింలు, రాజు, బాలరాజు, పోశెట్టి, గంగాధర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications