సహకరిస్తున్నాం, మంచి రాజధాని: :చంద్రబాబుకు నాయిని ప్రశంసలు
విజయవాడ: విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన విజయవాడలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
విజయవాడ నుంచే పరిపాలించాలనే ఆలోచన మంచిది అన్నారు. ఏపీ నుంచి పాలించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవంతో పాటు, అమరావతి నుంచే పాలన సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని పై వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ను పాలించిన వారు హైదరాబాద్పై తప్ప ఇతర ప్రాంతాలపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ దశ మారిందన్నారు. ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి రాజధానిని నిర్మిస్తున్నారని కొనియాడారు.

పరిపాలనను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చడం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల వంటి సమస్యలపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఉండే ఆంధ్రా ప్రాంతం వారికి తమ ప్రభుత్వం అన్నివిధాలా సహకారిస్తోందన్నారు.
ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపించాలని కమలనాథన్ కమిటీని కోరామన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారు అంతా ఒక్కటే అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications