Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NEET: ఆసిఫాబాద్‌ పరీక్ష కేంద్రంలో తారుమారైన నీట్ ప్రశ్నాపత్రం

ఆసిఫాబాద్: దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్​ పరీక్షలో పలు చోట్ల తప్పిదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్​టీఏ నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్​టీఏ అందించిన పేపర్ కాకుండా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నపత్రం అందించడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.

ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్​టీఏ నీట్​ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని మోడల్​ స్కూల్ పరీక్షా కేంద్రంలో 323 మందికి గానూ 299మంది పరీక్ష రాశారు. అయితే వారికి రావాల్సిన పేపరుకు బదులుగా ఎన్​​టీఏ తయారు చేసిన వేరే కోడ్​ ఉన్న మరొక ప్రశ్నాపత్రాన్ని నిర్వాహకులు అందించారు. సోమవారం కీ పేపర్​ పరిశీలించిన విద్యార్థులు తమకు ఇచ్చిన ప్రశ్నపత్రానికి ఎన్​టీఏ విడుదల చేసిన కీ పేపర్‌​లో లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

NEET Question Paper Changed in Asifabad exam centre

ఈ క్రమంలో దీనిపై జిల్లా కలెక్టర్‌​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు ఈ విషయంపై ఆర్డీవో లోకేశ్వరరావు పరీక్ష కేంద్రానికి వెళ్లి విచారణ చేశారు. దీనిపై పరీక్ష నిర్వాహకులను వివరణ కోరగా.. ఎస్​బీఐ బ్యాంకు నుంచి తీసుకురావలసిన పేపర్​‌కు బదులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్​‌ను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. అయితే ఎన్​టీఏ ఈమెయిల్ ఆధారంగానే పరీక్ష పత్రం తీసుకువచ్చినట్లు చెప్పారు.

ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ.. విద్యార్థులు రాసిన ప్రశ్నపత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఎన్​టీఏ అధికారులు వివరించినట్లు తెలిపారు. కాగా, ప్రశ్నపత్రం తారుమారుపై అధికారిక వెబ్​‌సైట్‌​లో ఉంచాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, నీట్​ పరీక్షా పత్రాలు లీక్​ అయ్యాయంటూ వస్తున్న వార్తలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(NTA) ఖండించింది. ఆదివారం దేశ వ్యాప్తంగా 4750 కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్​ పరీక్ష నిర్వహించినట్టు స్పష్టం చేసింది. నీట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్​ ప్రకారమే నిర్వహించినట్లు తెలిపింది.

పేపర్​ లీకేజీ జరిగినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. సోషల్​ మీడియాలో సర్క్యూలేట్​ అవుతున్న ప్రశ్నపత్రాలకు, ఆదివారం జరిగిన నీట్​ పరీక్షా పత్రాలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+