రాహుల్ను కలిసిన కేసిఆర్ మేనల్లుడు: గండ్ర ఫైర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేనల్లుడు ఉమేష్ రావు సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆయనతో చర్చించారు.
ఈ సందర్భంగా ఉమేష్ రావు మాట్లాడుతూ.. రాహుల్ తెలంగాణ పర్యటన తర్వాత కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. అందుకే మరోసారి రాష్ట్రంలో పర్యటించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు.
ఏడాది పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని రాహుల్కు తెలిపినట్లు చెప్పారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం పెంచాలని కోరినట్లు ఉమేష్ రావు తెలిపారు.

టిఆర్ఎస్ నేతల ఆగడాలు మితిమీరాయి
తెలంగాణ రాష్ట్ర సమితి నేతల ఆగడాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై సోమవారం జరిగిన దాడిని ఖండించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వివక్ష చూపుతూ అవమానపరుస్తోందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చని సిఎం కెసిఆర్ మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. చెల్పూర్ విద్యుత్ కేంద్రం తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications