మక్కా మసీదు పేలుళ్లపై తీర్పు: ట్విస్ట్, కోర్టుకు హాజరైన జడ్జి, రాజీనామా ఆమోదించలేదు
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి అంశంలో మరో ట్విస్ట్. ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. అయితే అంతకుముందు కొద్ది రోజుల పాటు సెలవులు పెట్టి, ఆ తర్వాత రాజీనామా ఆమోదించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే, ఇది గురువారం కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు రవీందర్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు. ఆయన సెలవులు కూడా రద్దు చేసింది. మరోవైపు, ఆయన నేడు (గురువారం) కోర్టుకు కూడా హాజరయ్యారు. దీంతో ఇది కొత్త మలుపు తిరిగింది. రాజీనామా చేసిన 48 గంటల్లోనే ఆయన విధులకు హాజరయ్యారు.

కాగా, మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన ఘటనలో సోమవారం ఉదయం తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి, సాయంత్రానికి రాజీనామాను సమర్పించిన విషయం తెలిసిందే.
ఎన్ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రవీందర్ రెడ్డి ఉన్నారు. ఆయన సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్కు పంపించారు. ఆయన మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఆయన తీర్పు అనంతరం సాయంత్రం హఠాత్తుగా రాజీనామా చేశారు.
ఎన్ఐఏ జడ్జిగా ఉన్న రవీందర్ రెడ్డి రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, మక్కా మసీదు కేసులో తీర్పు వచ్చిన రోజే రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తీర్పు తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన సన్నిహితులతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆయన తెలంగాణ జ్యూడిషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా అధికారికంగా పేర్కొన్నారని తెలుస్తోంది.
కానీ తీర్పు, బెదిరింపుల తర్వాత రాజీనామా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కారణాలు తెలియకుండానే.. ఆయన రాజీనామా చేయడం, హైకోర్టు ఆమోదించకపోవడం, ఆయన విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications