పెళ్లయిన ఐదు రోజులకే... అత్తారింట్లో నవ వధువు ఆత్మహత్య..
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన ఐదు రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు-మల్లమ్మ దంపతుల నాలుగో కుమార్తె మమతకు గతంలో వివాహమై విడాలకులు అయ్యాయి. పొట్యాల గ్రామానికి చెందిన మస్కం రాయమల్లు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఏకైక కుమారుడు మస్కం స్వామి కూడా గతంలో వివాహమై విడాకులయ్యాయి.

Recommended Video
మమతకు,స్వామికి ఈ నెల 11న ఇరువురి పెద్దలు వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా మమత కుటుంబ సభ్యులు కట్న కానుకలు సమర్పించారు. అయితే ఏమైందో తెలియదు కానీ పెళ్లయిన ఐదో రోజే... మమత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు.
మృతురాలు మమత సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని పోలీసులు కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. చివరిసారిగా ఆమె ఎవరితో మాట్లాడిందన్న వివరాలను సేకరిస్తున్నారు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications