ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో ముస్లింల ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన అసదుద్దీన్ ఒవైసీ.. వివిధ అంశాలపై కీలక విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బిజెపిని, ప్రధాని నరేంద్ర మోడీని నిరంతరం విమర్శిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండాలని అంటున్నారు.
Recommended Video


రాష్ట్రంలో తెరాస గాలి వీచినప్పటికీ, హైదరాబాద్ నగర పాలక సంస్థల్లో తెరాస అమేయమైన విజయం సాధించినప్పటికీ హైదరాబాదు పాతబస్తీలో తన పార్టీ బలాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు హైదరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన తన కంచుకోట పాతబస్తీని కాాపాడుకోగలిగారు.
కెసిఆర్కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఆయన మారారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తొలిసారి తెలుగు భాషలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. మోడీకి బద్ధ విరోధిగా వ్యవహరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.












Click it and Unblock the Notifications