Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు: ఎందుకంటే?

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని జయశంకర్ విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) స్పందించింది. ఈ ఘటనపై వివరణ కోరతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 25న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నాయకులు వర్సిటీ వద్దకు వెళ్లారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. స్కూటీపై వెళ్తూ ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టులాగారు. దీంతో ఆమె కిందపడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 NHRC notice to telangana government, due to jayashankar university student leader issue

ఈ ఘటనకు సంబంధించిన వీడియో కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తోపాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. అంతేగాక, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోలీసు తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ కవిత మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్? అంటూ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ఈ మేరకు కవిత ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ పెట్టారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) జోక్యం చేసుకోవాలంటూ ట్వీట్‌ను ట్యాగ్‌ చేయడం గమనార్హం.

మరోవైపు, ఏబీవీపీ మహిళా కార్యకర్తను జుట్టుపట్టిలాగిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. వ్యవసాయ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించవద్దని ఆందోళనకు దిగిన వాళ్లను తరిమికొట్టడమే గాకుండా, రోడ్డున వెళ్తున్న విద్యార్థి నాయకురాలి జుట్టు లాగిన పోలీసుల పైశాచికత్వం. సాటి ఆడవారి పట్ల కనీస మర్యాద పాటించని పోలీసులు. ఈ ఘటన అప్రజాస్వామిక, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ప్రతిబింబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఘటన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నాయకురాలిని పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+